మార్కాపురం జిల్లా కోసం మార్కాపురం పట్టణం బంద్

మార్కాపురం జిల్లా సాధన కొరకు మార్కాపురం జిల్లా సాధన సమితి(జేఏసి) ఆధ్వర్యంలో జరుగుతున్న మార్కాపురం పట్టణం బంద్ విజయవంతమైనది. సోమవారం ఉదయం 5:30 గంటల నుండి మార్కాపురం జిల్లా సాధన సమితి జేఏసి వైస్ చైర్మన్ మరియు జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ఆధ్వర్యంలో జేఏసి సభ్యులు మరియు ప్రజలు తెరచి ఉన్న కొన్ని షాపులను స్వచ్ఛందంగా మూసివేయాలని తెలియజేశారు. మార్కాపురం పట్టణంలోని వివిధ వ్యాపార, వాణిజ్య, విద్య, కార్మిక, ఉద్యోగులు, షాపులు స్వచ్ఛందంగా మార్కాపురం పట్టణ బందుకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్, జిల్లా సాధన సమితి చైర్మెన్ కందుల నారాయణరెడ్డి, వక్కలగడ్డ మల్లికార్జున, జిల్లా సాధన సమితి కన్వీనర్ సైదా, సి.పి.ఐ నాయకులు అందే నాసరయ్య, కాశిం, సి.పి.యం నాయకులు సోమయ్య, డి.కె.యం.రఫీ, జనసేనపార్టీ మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్, జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, జనసేనపార్టీ మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, పిన్నెబోయిన శ్రీను, వెంకటయ్య, శిరిగిరి శ్రీను, రత్న కుమార్, షరీఫ్, సంగటి వెంకటేశ్వర్లు, ఫణి, పోటు వెంకటేశ్వర్లు, ఖాజావలి, పిచ్చయ్య, శేఖర్, జానకి రామ్, మార్కాపురం ప్రజలు, మార్కాపురం నియోజకవర్గ జనసేన కార్యకర్తలు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.