చిరంజీవి 67వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఇచ్చాపురం జనసేన

ఇచ్చాపురం, డా. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 67వ జన్మదిన సందర్భంగా తిప్పన దుర్యోధన రెడ్డి ఆధ్వర్యంలో ప్రాణదాత బ్లడ్ బ్యాంక్ సాయంతో ఇచ్చాపురం మండలం బెన్నిగాను పేట గ్రామంలో జనసేన పార్టీ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఇచ్చాపురం సమన్వకర్త దాసరి రాజు మరియు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బైపల్లి ఈశ్వర్ రావు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరిబెహరా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కేకు కట్ చేసి రక్తదాన శిబిరం స్టార్ట్ చేసి సుమారు 23 మందికి పైగా రక్తదానం చేసి తలసేమియా పిల్లల కోసం గ్రామ జనసైనికులు సాయంతో రక్తం అందించడం జరిగింది. ఈ కార్యక్రమములో ఇచ్చాపురం జనసేన జడ్పిటిసి అభ్యర్ధిని నీలవేణి మరియు ముచింద్ర ఎంపీటీసీ సెంకర్ రెడ్డి భాస్కర్ సొంతోష్ మహరణ భాస్కర్ రెడ్డి మురళి మాధవరెడ్డి పాపారావు హేమసుందర్ రవి శంకర్ వికీ గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.