జనసేన పార్టీలో గుర్తింపు తథ్యం: కీర్తన

తిరుపతి, అక్టోబర్ 30 సోమవారానికి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించబడి ఒక సంవత్సర కాలం పూర్తైన సందర్భంగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన మాట్లాడుతూ జనసేన పార్టీలో గుర్తింపు తథ్యమని కళ్యాణ్ నాపై ఉంచిన బాధ్యతను త్రికరణ శుద్ధిగా చేస్తున్నానని, పవన్ కళ్యాణ్ స్ఫూర్తి మరియు సైద్ధాంతిక బలంతో పయనిస్తున్న నాకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగించినా, భయపడేది లేదు, గట్టి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని, మూర్ఖులు వందల సంఖ్యలో ఉండొచ్చు కానీ బుద్ధి బలం కలిగిన ఒక్కడు చాలు మూర్ఖుల మందని తరిమి తరిమి కొట్టడానికి అని తెలిపారు.