చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీరు సరఫరా

రాజోలు నియోజకవర్గం: మెరక పాలెం గ్రామంనకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త క్రీ.శే గిడుగు గణేష్ జ్ఞాపకార్దం వారి కుమారుడు జనసేన నాయకులు గిడుగు రమేష్ అందించిన ధన సహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతంతో సోమవారం జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న గోంది పద్మరాజుగారి కోలని ప్రాంత ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.