జనసేనానిపై తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం.. జనసేన జానీ

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బ్రోకర్ ఛానెల్స్ అడ్డుపెట్టుకోని పవన్ కళ్యాణ్ గారిపై తప్పుడు ప్రచారం చేస్తే జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు చూస్తూ ఊరుకోరని జనసేన జానీ మండిపడారౌ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా సేవాభావంతో ఉన్న వారికి అవకాశం కల్పిస్తూ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు బలపడుతుంది..
ప్రజల్లో చైతన్యం పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు, 2024 లో కచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి అని కోరుకుంటున్నాను, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలు కోసం అండగా ఉన్న ఒకే ఒక్క పార్టీ జనసేన పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిపై తప్పుడు రాతలు, తప్పుడు మాటలు ఆడితే బ్రోకర్ రాధాకృష్ణకి తగిన బుద్ది చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని జనసేన జానీ అన్నారు.