జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హాని తలపెడితే ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం: గోరంట్ల సాయి
అద్దంకి న్యూస్, జనసేన అద్దంకి నియోజకవర్గం యువ నాయకులు గోరంట్ల సాయి మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏదైనా చేయాలని ఎవరైనా అనుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకల్లోలం అవుతుందని దానికి ప్రభుత్వమే భాద్యత వహించాలని అద్దంకి నియోజకవర్గ జనసేన యువనాయకుడు సాయి అన్నారు. కొంతమంది వ్యక్తులు మూడు, నాలుగు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ కదలికలను గమనిస్తూ రెక్కి నిర్వహిస్తున్నారని నాదెండ్ల మనోహర్ మీడియాలో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ కారులో గుజరాత్ మాఫియా రెక్కి నిర్వహించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రాణాలకి హాని ఉందని కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కి ట్విట్టర్ల ద్వారా విజ్ఞప్తి చేశారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని పవన్ కళ్యాణ్ తగిన సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఏదైనా ఇబ్బంది తలపెట్టాలి అని ఎవరైనా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా అనుకుంటే అతనికి కుక్క బతుకు తప్పదని అయన హెచ్చరించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-04-at-20.14.48-1024x1024.jpeg)