జనసేనకు ఒక అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేసి చూపిస్తాం: కరిమజ్జి మల్లీశ్వారావు
*ఉపాధి కూలీలతో కరిమజ్జి మల్లీశ్వారావు భేటీ
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం పవన్ రావాలి పాలనా మారాలి నినాదంతో ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం వెంకటరావుపేట గ్రామ చెరువులో ఉన్న ఉపాధి కూలీలతో మాట్లాడుతూ.. జనసేనకు ఈసారి అవకాశం ఇవ్వాలని అలాగే.. జనసేనపార్టీ సిద్దాంతాలను మరియు మేనిఫెస్టో గురించి చెబుతూ.. గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, తెల్లరేషన్ కార్డుకు ఇసుక ఫ్రీగా.. ఇవ్వడం జరుగుతుందని, రేషన్ బదులుగా మహిళల ఖాతాల్లో రూ”2500-3500-వరకు నగదు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆదర్శాలను మరియు ఆచరించే విధానాలను ప్రజలకు కరిమజ్జి మల్లీశ్వారావు వివరించితిరి. టిడిపి. వైసీపీ ప్రభుత్వ పాలన చూశారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి జనసేన పార్టీ పాలన కూడా ప్రజలు చూడాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల వారికి మేలు చేయాలనే ఆలోచనతో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఎన్నికల్లో జనసేనపార్టీకి మద్దతు ఇవ్వాలని కరిమజ్జి మల్లీశ్వారావు మరియు పోట్నూరు లక్ష్మునాయుడు కోరడమైనది. ఈ కార్యక్రమంలో వెంకటరావుపేట గ్రామ ప్రజలు, పెద్దలు మహిళలు జనసైనికులు సురేష్, బాస్కర్, రామకృష్ణ, కోటి, అప్పలరాజు, సత్యనారాయణ, నారాయణరావు, జగదీశ్, హరి, భాషా, తులసినాయుడు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-07-at-11.51.42-AM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-07-at-11.52.00-AM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-07-at-11.52.00-AM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-07-at-11.52.01-AM-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-07-at-11.52.01-AM-1.jpeg)