నాదెండ్ల మనోహర్ అరెస్టుని ఖండిస్తున్నాం: అంకె ఈశ్వరయ్య

అనంతపురం: విశాఖపట్నంలోని అధికార పార్టీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారంకోసం ఏకంగా రోడ్డును మూసేయడం దారుణమని జనసేన పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య ఆరోపించారు. విశాఖపట్నంలోని టైకూన్ సెంటర్
రోడ్డు మూసివేతకు నిరసనగా జనసేన పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన క్రమంలో టైకూన్ సెంటర్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసారు. నాదెండ్ల మనోహర్ తో పాటు జనసేన నాయకుల అరెస్ట్ ను జనసేన పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య ఖండించారు. విశాఖలో అత్యంత రద్దీగా ఉండే టైకూన్‌ జంక్షన్‌ను వైసీపీ నేతల స్వప్రయోజనాల కోసం మూసేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం దుర్మార్గమని అంకె ఈశ్వరయ్య మండిపడ్డారు. ఇదేంటని ప్రశ్నించిన జనసేన నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష నేతలపై పోలీసుల దౌర్జన్యం సరికాదని అంకె ఈశ్వరయ్య హెచ్చరించారు. వైసిపి నేతల ఆస్తులకు వాస్తుదోషం వుంటే ఏకంగా రోడ్డునే మూసేస్తారా? ఇది వైసిపి అరాచకాలు ఏ స్థాయిలో వున్నాయో అద్దం పడుతుందని అంకె ఈశ్వరయ్య అన్నారు. రోడ్లు వేసే దమ్ములేదు కానీ ఉన్నరోడ్లను మూసేస్తారా? అని నిలదీసారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలుకావడం లేదని.. ప్రజాప్రయోజనాల కోసం
ఉపయోగించాల్సిన చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని అంకె ఈశ్వరయ్య ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను కూడా వైసిపి ప్రభుత్వం దారిమళ్లించి అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి విశాఖపట్నం టైకూన్ సెంటర్ రహదారిని పునరుద్దరించాలి… అరెస్ట్ చేసిన జనసేన నాయకులను విడుదల చేయాలని జనసేన పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య డిమాండ్ చేయడం జరిగింది.