ప్రజా సమస్యలు గాలికి వదిలితే ప్రభుత్వాన్ని ప్రజలు గంగలో కలుపుతారు: మాకినీడి

  • ప్రజా సమస్యలు గాలికి వదిలితే ప్రభుత్వాన్ని ప్రజలు గంగలో కలుపుతారు.. జనసేనకు ఒక్క చాన్స్ కార్యక్రమంలో మాకినీడి ఎద్దేవా..!!
  • రాష్ట్ర అభివృద్ధికై.. జనసేనకు ఒక్క చాన్స్ ఇవ్వండి కార్యక్రమం 6వ రోజు

పిఠాపురం: ఏ బిడ్డా.. ఇది జగన్ అడ్డా అన్నట్లుగా సాగుతున్న వై.సి.పి పాలనకు ప్రజలు చమరగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని మేము ఈ ఐదు రోజులు జనసేనకు ఒక్క చాన్స్ కార్యక్రమంలో స్పష్టంగా ఈ విషయన్ని గమనించామని పార్టీ పిలుపు మేరకు పట్టణంలో స్థానిక యానాధుల కాలనిలో తలపెట్టిన కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ప్రజలు వెల్లువెత్తిన సమస్యలతో ఆవేదన చెందుతున్నారని, ఇక్కడ ఈ కాలని వాసులు వీధి లైట్లు లేక చంటి పిల్లలతో చీకట్లో గడుపుతుంటే, వార్డు కౌన్సిలర్ పట్టించుకోలేదని అధికారులు ఏ నాయకుడు పట్టీంచుకోకపోవడంతో కాలని వాసులే చందాలేసుకుని రెండు స్థంబాలు కొనుక్కుంటే వాటిని వేయడానికి కూడా ఏ అధికారి రాకపోవడం అంటే పాలన ఏ స్ధాయిలో ఉందో అర్థం చేసుకోవాలని, ఇంత ఇబ్బంది పడుతుంటే ఓట్లు వేయించుకున్న కౌన్సిలర్ నిద్ర పోతున్నాడా అని మండిపడ్డారు. ఇరవై కోట్లు పట్టణ అభివృద్ధి ప్రకటించారు అవి ఇలాంటి పనులకు ఉపయోగించకుండా ఏ గాలికి మళ్ళీంచారో సమాదానం చెప్పాలని, కాలనిలో అడుగు పెడితే డ్రైనేజి, పరిసరాలు కంపుకొడుతున్నాయని, కొల్లగొట్టే పనులు ఆపి ఇలా కంపు కొట్టే ప్రాంతాలు బాగు చేయడానికి మనసురాని నాయకులకు తొందరలో సాగనంపుతారని జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఈ కాలనీ కంచుకోట చేస్తామన్నారు. కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు జనసేన పోరాడుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, బుర్రా సూర్యప్రకాష్, మేళం బాబి, కసిరెడ్డి నాగేశ్వరరావు, పబ్బినీడి దుర్గాప్రసాద్, కంద సోమరాజు, వినయ్, సుబ్రహ్మణ్యం, నామ సాయిబాబు, అంజిబాబు, సింహాద్రి, రాజు, కృష్ణ, శ్రీనివాస్, రాజేంద్ర, జనసైనికులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.