జనసైనికుల్ని ఇబ్బందులకు గురిచేస్తే తగినవిధంగా బుద్ది చెప్తాం

సత్యవేడు నియోజకవర్గం KVBపురం మండలం అంజూరు గ్రామానికి చెందిన మోహన్ మీద అధికార పార్టీ నాయకులు అక్రమ కేసు పెట్టారు. వివరాల్లోకి వెళితే… అధికార పార్టీకి చెందిన బ్యానర్ ని అదే గ్రామానికి చెందిన మాతయ్య అనే వ్యక్తి చేత మోహన్ చింపించాడని, దీన్ని జనసేన పార్టీకి చెందిన మోహన్ చేయించినట్లు చెప్పాలని దళిత యువకుడు అయిన మాతయ్యను రెండు రోజులు పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి కొట్టి, భయభ్రాంతులకు గురిచేసి, జనసైనికుడు మీద కేసు నమోదు చేయించడం జరిగింది. అంతేకాకుండా అధికార పార్టీ నాయకుల ఇంటిమీద దాడికి వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై జిల్లా కార్యదర్శులు కొప్పల లావణ్యకుమార్, హేమకుమార్ మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే ఎలా, ఈ రోజు ప్రభుత్వం వైసీపీది. అధికారం ఏ ఒక్కరి సొంతం కాదు. రేపు జనసేన అధికారంలోకి వస్తుంది. మా జనసైనికుల్ని ఇబ్బందులకు గురిచేస్తే తగినవిధంగా బుద్ది చెప్తామని హెచ్చరించారు.