కమిషనర్ ను బదిలీ చేయాలని చుస్తే జనసేన తరపున ఉద్యమిస్తాం: సుంకర శ్రీనివాస్

కడప నియోజకవర్గం: మున్సిపల్ కమిషనర్ ను అక్రమ బదిలీ చేయాలని చుస్తే జనసేన తరపున ఉద్యమిస్తామని కడప జనసేన అసెంబ్లీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ పేర్కొన్నారు. కడప జనసేన కార్యాలయంలో జనసేన ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో శ్రీనివాస్ మాట్లాడుతూ.. కడప నగరంలో ఐఏఎస్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ రావడం కడప ప్రజల అదృష్టం అన్నారు. కానీ కడప నగరాన్ని అభివృద్ధి చేస్తున్న కమిషనర్ ను వైసిపీ నేతలు ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్న కమిషనర్ ను బదిలీ చేయాలని చూస్తున్నారు. నగర అభివృద్ధికి కమిషనర్ కష్టపడి పనిచేస్తున్నారు. కమిషనర్ ను బదిలీ చేయాలని వైసిపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. కమిషనర్ ను బదిలీ చేయాలని వైసిపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కమిషనర్ ను అక్రమ బదిలీ చేయాలని చుస్తే జనసేన తరపున ఉద్యమిస్తాం. సిఎం జగన్ కు జనసేన పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. కడప కమిషనర్ కష్టపడి పని చేస్తూ నగర అభివృద్ధి చేస్తున్నారు. కొంత మంది కార్పొరేటర్లు కావాలనే కమిషనర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కడప ప్రజల ఆకాంక్ష సిఎం జగన్ వినాలి. నగరం అభివృద్ధి జరిగితే సిఎం జగన్ కే మంచి పేరు వస్తుంది. దివంగత మహానేత వైఎస్సార్ పేరు కడపకు పెట్టారు. కడప అభివృద్ధి చేస్తుంటే వైసిపీ నేతలకు ఎందుకు దిగులు. కడపలో పోలీసులు సివిల్ పంచాయతీ లు చేస్తున్నారు. పారదర్శక పాలన జరగాలని, అవినీతి రహిత పాలన అని చెప్తున్న సిఎం దాన్ని ఆచరణలో పెట్టాలని సుంకర శ్రీనివాస్ పేర్కొన్నారు.