పవన్ కళ్యాణ్ కి ఏదైనా చేయాలని అనుకుంటే వారికి కూడా అదే జరుగుతుందని సిద్ధపడే ఉండాలి

కందుకూరు, పవన్ కళ్యాణ్ కి ఏదైనా చేయాలని ఎవరైనా అనుకుంటే వారికి కూడా అదే జరుగుతుందని సిద్ధపడే ఉండాలి కందుకూరు నియోజకవర్గ జనసేన యువనాయకులు రాజేంద్ర అన్నారు. కొంతమంది వ్యక్తులు రెండు మూడు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ కదలికలను గమనిస్తూ రెక్కి నిర్వహిస్తున్నారని నాదెండ్ల మనోహర్, మీడియాలో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర రాత్రి ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ కారులో గుజరాత్ మాఫియా రెక్కి నిర్వహించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రాణాలకి హాని ఉందని కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా లకు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని పవన్ కళ్యాణ్ కి తగిన సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ కి ఏదైనా ఇబ్బంది తలపెట్టాలి అని ఎవరైనా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా అనుకుంటే అతను కూడా ఆ ఇబ్బందులకు సిద్ధం అవ్వాలని రాజేంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూర్ నియోజకవర్గ జనసేన నాయకులు గోవిందయ్య జనార్ధన్, వేణు, కందుకూరు పట్టణ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు దండ నాగార్జున, గిరి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.