జనసేన నేతల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

మామిడికుదురు, పవిత్ర రంజాన్‌ మాసం ముస్లిం సోదరులకు శుభాలు కలిగించాలని జనసేన మామిడుకుదురు మండల శాఖ అధ్యక్షులు జాలెం శ్రీనివాస రాజా, జనసేన నేత యెరుబండి చిన్ని అన్నారు. ముస్లింలు పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేసినముస్లిం సోదరులకు శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రత్యేక ప్రార్ధనలు జరిపారు. ఈ సందర్బంగా వారు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించిన ఆయన, దేవుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ బాగుండాలని, జిల్లా అభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని కోరారు. అనంతరం ముస్లిం ప్రముఖులు నగరంలో జరిగిన ఇఫ్తార్‌ విందులోపాల్గొని, ముస్లిం వస్త్రాదారణలో, ప్రత్యేక ప్రార్థనల్లో ఫాల్గొని, ఆప్యాయంగా ముస్లిం సోదరులను పలకరించి విందును వడ్డించారు. జనసేన మామిడికుదురు మండల శాఖ అధ్యక్షులు జాలెం శ్రీనివాస రాజా, జనసేన నేత యెరుబండి చిన్ని, ఈ విందును ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.