హుజూర్నగర్ జనసేన ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

హుజూర్నగర్, పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా హుజూర్నగర్ పట్టణంలోని ముస్లిం సోదరులకు ఉస్మానియా మసీదులో మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకునే రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులందరికి జనసేన పార్టీ తరుపున ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. శాంతియుతంగా రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్య నిర్వాహకులు సరికొప్పుల నాగేశ్వరరావు జనసేన పార్టీ నాయకులు అందే శ్రీను, హాసనమియా, చారీ నాగ, కొమ్మరాజు శ్రీను, మహమ్మద్ ఫహీం, సట్టు చందు, రాకేష్ పిల్లుట్ల రమేష్, శ్రీకాంత్, రాంబాబు, మస్తాన్, జానీ, ముస్తఫా, మహేష్, నరేష్, బండారు శ్రవణ్, నాగరాజు, అరవింద్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.