టీటీడీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ కు అండగా నిలబడిన జనసేన నాయకుల అక్రమ అరెస్టులు

తిరుమల తిరుపతి దేవస్థానం ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ చేస్తున్న శాంతియుత ధర్నాని అడ్డుకున్న పోలీసులు… అండగా నిలబడ్డ జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ డా. పసుపులేటి హరిప్రసాద్ మరియు జనసేన నాయకులు.

టీటీడీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ వారు శాంతియుతంగా 14 వ రోజు చేస్తున్న దర్నాని శుక్రవారం 10 డిసెంబర్ 2021 నాడు పోలీసువారు అక్రమంగా అడ్డుకొని కార్మికులకు మద్దతుగా నిలిచిన జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, శ్రీ పగడాల మురళి, పార్టీ నేతలు శ్రీ మధుబాబు, శ్రీ రాజారెడ్డి, శ్రీ దేవర మనోహర్ తదితరులను అరెస్ట్ చేశారు. టిడిపి ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ను మరియు వారికి మద్దతు పలికిన జనసేన నాయకులను మరియు CPM, CITU నాయకులను పోలీసు వారు అక్రమంగా అరెస్ట్ చేసి MR.పల్లి దగ్గర ఉన్న పోలీస్ పెరడే గ్రౌండ్ దగ్గరికి తరలించారు. జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ మరియు ఇతర నాయకులు స్పష్టం చేశారు.