గుండ్లకమ్మ బ్రిడ్జి సమస్యను జనసేనాని దృష్టికి తీసుకువెళ్ళిన ఇమ్మడి కాశీనాధ్
*జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం ద్వారా ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నాగులవరం గ్రామం వెళ్ళు రోడ్డు మార్గంలో గుండ్లకమ్మ బ్రిడ్జి సమస్యను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్
జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పవన్ కళ్యాణ్ గారికి వివరిస్తూ.. మార్కాపురం మండలం నాగులవరం గ్రామ ప్రజలు అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నప్పటికి సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం అన్యాయమని, నిత్యం ప్రతిరోజు వందలాది మంది ప్రజలు నాగులవరం గ్రామం నుండి జీవనోపాధి కోసం డివిజన్ కేంద్రమైన మార్కాపురం పట్టణానికి గుండ్లకమ్మ చప్టాపై రాకపోకలు సాగిస్తుంటారని, ముఖ్యంగా భారీ వర్షాలు కురిసిన సమయంలో గుండ్లకమ్మ చప్టాపై నీరు ఉదృతంగా ప్రవహిస్తుంటుందని అన్నారు. ఆ సమయంలో ముఖ్యంగా రాత్రి వేళల్లో కార్మికులు, వ్యవసాయ కూలీలు ఇంటికి చేరుకునే సందర్బాలలో చాల మంది నీటి ప్రవాహంలో కొట్టుకోపోయి మృత్యువాతకు గురయ్యారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కావున ఇప్పటికయినా ప్రభుత్వం మేల్కొని బ్రిడ్జి నిర్మాణం చేపట్టి పెద్ద నాగులవరం గ్రామ ప్రజల సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు. ఈ భేటీలో గుండ్లకమ్మ చప్టా నీటి ప్రవాహంలో కొట్టుకోపోయిన బాధితుల కుటుంబ సభ్యులు హాజయ్యారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-03-at-10.59.30-PM-1024x537.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-03-at-10.59.31-PM.jpeg)