పడమటిపాలెంలో జనంలోకి జనసేన

నరసాపురం, జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా 15 వ రోజు నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం మొగల్తూరు పంచాయతీ పడమటిపాలెం గ్రామంలో ఇంటింటికీ తిరిగి జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేసి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వారికి జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పిఎసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ చైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్ గారు. ఈ గ్రామంలో ముఖ్యంగా మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు అని ఆ గ్రామ ప్రజలు తెలిపారని నాయకర్ గారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపికృష్ణ, ఆకన చంద్రశేఖర్, వాతాడి కనకరాజు, దూది బాబు, నిప్పులేటి తారకరామారావు, గజ్జరపు మురళి, ఉప్పులూరి రాంబాబు, లక్కు బాబి, కూనపరెడ్డి రామకృష్ణ, అయితం చిన్ని, దాసరి నాగరాజు, కత్తుల యుగంధర్, అందే కొండ, కొత్తపల్లి కోటేశ్వరరావు, గురుజు తాతాజీ, పులపర్తి రాంబాబు, కొండేటి తాతాజీ, అడబాల సత్యనారాయణ, నల్లి నాగరాజు మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు మరియు మొగల్తూరు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.