పొన్నాడ గ్రామంలో జనంలోకి జనసేన

పిఠాపురం: ఉప్పాడ కొత్తపల్లి మండలం, పొన్నాడ గ్రామంలో పిఠాపురం జనసేన ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన నాగార్జున అధ్వర్యంలో పి.ఎస్.ఎన్. మూర్తి సంక్రాంతి కానుకగా సుమారు 25 మందికి బియ్యం పంచడం జరిగింది. బుర్రా సూర్యప్రకాష్, టైల్స్ బాబి మాట్లాడుతూ.. జనం కోసం జనసేన ఎప్పడు అండగా ఉంటుంది అని మేము అధికారంలోకి రాగానే మీకు పక్క ఇళ్లు ఇప్పిస్తాము అని మాట ఇచ్చారు. మీరు అందరూ జనసేన తెలుగుదేశం కూటమికి ఓటు వేసి గెలిపించండి అని కోరారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో జనసేన నాయకులు పిండి శ్రీను, బుర్రా సూర్యప్రకాష్, టైల్స్ బాబీ, పెదిరెడ్ల భీమేశ్వరరావు, బీసీ నాయకులు మల్లం శ్రీనివాస్, ముప్పన రత్నం, పెంకే జగదీష్, పెనుమచ్చ రామా దేవి, విజ్జడా దుర్గాదేవి, కొప్పిశెట్టి దేవి, మరియు పి. ఎస్.ఎన్ మూర్తి, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.