రేపూరు గ్రామంలో వైసీపీ, బిజేపిల నుంచి జనసేనలో భారీ చేరికలు

కాకినాడ రూరల్ మండలం, రేపూరు గ్రామంలో రేపూరు జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు నక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన వై.సి.పి, బి.జే.పి పార్టీల నాయకులు, కార్యకర్తలు సుమారు 25 మంది కొనే శ్రీకాంత్, కొనే రాజేశ్వరి, ఎన్.దుర్గా కిరణ్, ప్రవల్లిక, అనిల్ వర్మ, పార్వతి దేవి, తమ్మయ్య నాయుడు, సురేంద్ర, వీరేంద్ర తదితరులు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరికి జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అని అధికారం చేపట్టిన వై.సి.పి ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని, అన్ని వర్గాల ప్రజలు వై.సి.పి ప్రభుత్వంపై పూర్తి అసంతృప్తితో ఉన్నారని, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, కార్యదక్షత, సిద్ధాంతాలు నచ్చి మహిళలు, పెద్దలు, యువత జనసేన లో చేరుతున్నారని, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయ కేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండల జనసేన అధ్యక్షులు కరెడ్ల గోవిందు, కరప మండల అధ్యక్షులు బండారు మురళి, జిల్లా ప్రధానకార్యదర్శి శిరంగు శ్రీనివాస్, ముమ్మిడి బుజ్జి, పట్టాభి, తోట వేణు, రెడ్డిపల్లి కిషోర్, బూరయ్య, సాన శ్రీనివాస్, గుమ్మడి వీరబాబు, నక్క బుజ్జి, దేవు శ్రీనివాస్, సతీష్, శరత్, సత్యకుమార్, జనసేన నాయకులు, విరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.