డ్రగ్స్ కేసులో.. తెరపైకి నమ్రత పేరు

ముంబై డ్రగ్స్ కేసు టాలీవుడ్‌నూ కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియా చక్రవర్తి అరెస్ట్‌ తర్వాత ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు డ్రగ్స్ కేసు విచారణలో ముంబై డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు విచారణ కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. విచారణలో రియా చక్రవర్తి పలువురు హీరోయిన్ల పేర్లు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు సతీమణి, నటి నమ్రత శిరోద్కర్ పేరు జాతీయ మీడియాలో తెరపైకి వచ్చింది. టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రత డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్టు తన కథనంలో పేర్కొంది. బాంబేలో మంచి ఎండీ ఇస్తావని ప్రామిస్ చేశావ్‌.. ఎండీ ఇచ్చాక మనం కలిసి పార్టీ చేసుకుందాం అని నమ్రత చాట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు జయసాహాను విచారిస్తున్న క్రమంలో నమ్రత శిరోద్కర్ పేరు చెప్పినట్టు తెలుస్తోంది.