ఏపిలో పెరిగిన కోవిడ్-19 కేసులు.. కోలుకున్నవారి సంఖ్య వివరాలు

ఏపిలో కరోనావైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగిపోతోంది. గత 24 గంటల్లోనే సుమారు 9,996 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 2,61,247 లకు చేరుకుంది. గడచిన 24 గంటల్లో మొత్తం 9,499 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 1,68,029 కి చేరుకుంది. ప్రస్తుతం 90,840 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 55,692  కోవిడ్-19 టెస్టులు నిర్వహించారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 27,05,459 కు చేరుకుంది.