IND Vs ENG 2nd ODI: భారత్‌పై 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం

తొలి వన్డేలో గెలిచి ఊపుమీదున్న టీమిండియాకు షాక్ ఇచ్చింది ఇంగ్లండ్.. పుణె వేదికగా జరిగిన రెండో వన్డేలో.. భారీ లక్ష్యాన్ని సైతం ఈజీగా బీట్ చేసింది ఇంగ్లండ్ టీమ్.. రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్‌పై గ్రాండ్ విక్టరీ కొట్టింది.. దీంతో మూడు వన్డేల సిరీస్.. ప్రస్తుతం 1-1తో సమం కాగా.. మరో వన్డే మిగిలి ఉంది.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసి.. ఇంగ్లండ్ ముందు 337 పరుగుల భారీ టార్గెట్‌నే పెట్టింది.. కేఎల్ రాహుల్ 108, కెప్టెన్ విరాట్ కోహ్లి 66, రిషభ్ పంత్ 77, హార్దిక్ పాండ్యా 35 రాణించడంతో.. భారీ స్కోర్ చేసింది కోహ్లీసేన.. ఇక, అనంతరం 337 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. సునాయసంగా విజయం సాధించింది.. కేవలం 43.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జేసన్ రాయ్ 55 పరుగులు చేయగా.. బెయిర్ స్టో 124 పరుగులతో చెలరేగాడు..

మరోవైపు… రెచ్చిపోయిన బెన్ స్టోక్స్ కేవలం 52 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో విరిచుకుపడి 99 పరుగులు చేశాడు.. అయితే, సెంచరీ మాత్రం మిస్ అయ్యాడు. ఇక, చివర్లో లియామ్ లివింగ్ స్టోన్ 27, డేవిడ్ మలాన్ 16 పరుగులు చేసిన ఇంగ్లండ్ జట్టుకు విజయాన్ని అందించారు.

దీంతో.. తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన ఇంగ్లండ్.. రెండో మ్యాచ్‌లో గెలిచి.. భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంది.