పబ్జీని బ్యాన్ చేసిన భారత్

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో పబ్జీ గేమ్ ను నిషేధిస్తూ కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టిక్ టాక్ తో పాటు పలు చైనా యాప్స్ పై కేంద్రం నిషేధం విధించింది. పబ్జీ యాప్ ను భారత్ లో 70 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. మరో 118 మొబైల్ యాప్స్ పై కూడా నిషేధం విధించినట్టు కేంద్రం తెలిపింది.