భారత్, అమెరికా బంధం.. ‘కమల’తో మరింత బలోపేతం’

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్​ బాధ్యతలు చేపట్టిన తరుణంలో శ్వేతసౌధం కీలక ప్రకటన చేసింది. కమలా హారిస్​ ద్వారా భారత్​, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడతాయని పేర్కొంది. ఈ మేరకు శ్వేతసౌధ పత్రికా వ్యవహారాల కార్యదర్శి జెన్​ సాకి తెలిపారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటిరోజున విలేకరులతో ఆమె మాట్లాడారు.

“అధ్యక్షుడు జో బైడెన్​.. భారత్​లో అనేక సార్లు పర్యటించారు. భారత్​, అమెరికా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను ఆయన గౌరవిస్తారు. ఇక ముందు కూడా దానిని ఆయన కొనసాగిస్తారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ద్వారా ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమవుతుంది.”​