ఇండియా vs శ్రీలంక.. నేడే రెండో టీ-20

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు టి20 సిరీస్ ను టార్గెట్ పెట్టుకుంది. మొత్తం మూడు మ్యాచ్ ల సిరీస్ తో మొదటి మ్యాచ్ లో విజయం సాధించింది భారత్. కాగా నేడు రెండో మ్యాచ్ జరగనుంది. ఇక తొలి మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి విజయంలో కీలక పాత్ర పోషించారు.

అయితే ఇప్పుడు శిఖర్ ధావన్ రెండో మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.