తణుకు జనసేన ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

తణుకు: తణుకు పట్టణం, హౌసింగ్ బోర్డ్ కాలనీలో 73వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మరియు దళిత సంఘ నాయకులు స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశాన్ని నడిపిస్తున్న రాజ్యాంగం అందుకే మన రాజ్యాంగ గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిందని రామచంద్రరావు అన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, తణుకు మండలం అధ్యక్షులు చిక్కాల వేణు, ఇరగవరం మండలం అధ్యక్షులు ఆకేటి కాశి, తణుకు నియోజకవర్గ అధికార ప్రతినిధి పంతం నానాజీ, జవ్వాది ప్రసాదు, ఎమ్మార్పీఎస్ నాయకులు చెట్టే సుజనారావ్, దిద్దే మధుబాబు, చదలవాడ నాని, కారుమంచి మిత్ర మరియు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు.