టిఎంసిలోకి భారత క్రికెటర్
కోల్కతా: భారత క్రికెటర్ మనోజ్ తివారీ టిఎంసి పార్టీలో చేరారు. హుగ్లీలో జరిగిన ర్యాలీలో సిఎం మమతా బెనర్జీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు. కాగా, కొంతకాలంగా మనోజ్ తివారీ మోడీ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మనోజ్ తివారి మాట్లాడుతూ.. బిజెపి విభజన రాజకీయాలకు పాల్పడుతుండగా, టిఎంసి ప్రజల్ని ఐక్యం చేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఈ నెల 3న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మనోజ్ తివారీ.. 12 వన్డేలు, మూడు టి 20ల్లో ఆడారు. ఐపిఎల్లోనూ ఆడారు. అయితే త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్వయంగా బరిలోకి దిగుతారా.. పార్టీ తరపు ప్రచారం చేస్తారా అన్నది తెలియాల్సి వుంది. ఈ రోజు నుంచి తన కొత్త ప్రయాణం ప్రారంభమైందంటూ మనోజ్ ట్వీటర్లో పేర్కొన్నారు.