ఆస్ట్రేలియాలో అడుగు పెట్టిన భారత జట్టు

కోహ్లీ న్యాయకత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాలో అడుగు పెట్టింది. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే.. ప్రత్యేక విమానంలో దుబాయ్‌నుంచి వెళ్లిన జట్టు సభ్యులు నేరుగా సిడ్నీకి చేరుకున్నారు. ఆ తర్వాత తాజాగా బీసీసీఐ భారత జట్టు ఆసీస్ కు చేరుకున్న ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ నెల 27 నుండి ప్రారంభం కానున్న ఈ టూర్ లో భారత జట్టు మొత్తం మూడు టీ 20, మూడు వన్డే, నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. అందులో డిసెంబర్ 17-21 వరకు జరిగే మొదటి డే-నైట్ టెస్టులో మాత్రమే భారత కెప్టెన్ విరాట్ ఆడనున్నాడు. ఇక కేవలం టెస్ట్ జట్టులో మాత్రమే చోటు సంపాదించుకున్న రోహిత్ శర్మ మాత్రం ఆసీస్ కు వెళ్ళలేదు. యూఏఈ నుండి భారత్ కు వచ్చి పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాత హిట్ మ్యాన్ వెళ్లి భారత జట్టుతో కలవనున్నాడు.