జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శ్రీ శంకర్ గౌడ్ స్పూర్తితో గుంతలు పూడ్చివేత

4 డిసెంబర్ 2021 నాడు బైక్ కొనుక్కోవడనికి వర్ధనపేట్ మండలంకి వెళుతున్న క్రమంలో, రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటం చూసి తన హృదయం చలించిపోయి నందనం గ్రామ యువకుడు బర్ల శివ(జనసేన పార్టీ మండల అధ్యక్షుడు) జాతీయ రహదారిపై ఉన్న గుంతలను పూడ్చివేత కార్యక్రమం చేపట్టి, రోడ్డు వేయటం జరిగింది. ఈ క్రమంలో బర్ల శివ మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ స్పూర్తితో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి నేమురి శంకర్ గౌడ్ మరియు ఉప అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి శ్రీ ఆకుల సుమన్ ల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమన్నీ చేపట్టినట్టు తను తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు జె.సందీప్, బి.రాజ్ కుమార్, ఐ.దయాకర్, ఎస్.కె అజర్, వై.శ్రీకాంత్, సతీష్, రాజ్ కుమార్, ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.