ఎస్.కోట జనసేన అధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవము

  • 60 మంది దివ్యంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ

శ్రీనగవరపుకోట: ఎస్.కోట జనసేన అధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవము ఆదివారం ఎస్.కోట అర్.కే కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. వికలాంగుల రాష్ట్ర సంగం నిరుద్యోగ జేఏసీ ఉపాధ్యక్షులు కొలామదు అధ్యక్షత వహించిన ఈ సభలో దివ్యంగుల నుద్దేశించి జనసేన నియోజకవర్గ సీనియర్ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు మాట్లాడుతూ కుడు గుడ్డ ఇల్లు విద్య వైద్య ఉద్యోగ ఉపాధి శిక్షణ కార్యక్రమాలను, వికలాంగుల సంక్షేమ కోసం బడ్జెట్ నిధులు కేటాయించి అమలు చేసినపుడే డివ్యంగుల జీవితాల్లో వెలుగులు నింపాలని తద్వారా వారు సమాజములో ఆత్మగౌరవంతో బతకాలని అందుకు జనసేన పార్టీ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమములో నియోజక వర్గ 5 మండలాల జనసేన అధ్యక్షులు కె.రామకోటి, సుంకర అప్పారావు ప్పెనుమత్స రాజు, గోరపల్లి రవి, రామెళ్ళ శివాజీ, అలమండ రాంబాబు, జాన్నపల్లి సత్తిబాబు, కోలా కన్నయ్యదొర, బుజ్జి మరియు కిరణ్ మహిళా సమైక్య సంగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, వాలంటరీ హెల్త్ సర్వీసెస్ ఎన్. హరణధరావు, సి హెచ్ సంగ నాయకులు ఏ.నూ కప్పరావు, ఎస్ ఎస్ నాయుడు, ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.