నిధుల గోల్మాల్పై విచారణ చేపట్టాలి: పోలిశెట్టి తేజ
- అవినీతిలో సర్పంచ్ – ఈవో పాత్ర..
- విచారణ జరిపి ప్రజాధనం కాపాడాలి
మైలవరం: మూలపాడు పంచాయతీ నిధుల గోల్ మాల్ విషయంలో అధికారులు సమగ్ర విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు మరియు ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి తేజ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తేజ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాధనాన్ని కాపాడాల్సిన సర్పంచ్ మరియు ఈవో పోటీపడి అవినీతి చేశారని, ఇప్పుడు వాటాల్లో తేడా రావటంతో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. వీరి అవినీతితో మూలపాడులో పాలన పడకేసిందని అధికారులు సమగ్ర విచారణ చేసి ప్రజాధనాన్ని కాపాడి – దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి రహిత రాజకీయాలకు జనసేన పార్టీకి ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-30-at-1.07.14-PM-1024x681.jpeg)