గుత్తికొండ రామ యోగేంద్ర స్వాముల వారి తిరునాళ్లకు ఆహ్వానం

ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం, కురిచేడు మండలంలోని పొట్లపాడు గ్రామంలో 9వ తారీఖు సోమవారం జరుగు గుత్తికొండ రామ యోగేంద్ర స్వాముల వారి తిరునాళ్లకు అక్కడ ఏర్పాటు చేయుచున్న జనసేన విద్యుత్ ప్రభ మీదకు ముఖ్య అతిథిగా రావాలని ఆదివారం పొట్లపాడు గ్రామస్తులు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు వరికూటి నాగరాజుని పొదిలిలోని వారి స్వగృహం నందు కలసి శాలువాతో సత్కరించి ఆహ్వాన పత్రికను అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కురిచేడు మండలం మాజీ జడ్పిటిసి సభ్యులు వరికూటి వెంకటేశ్వర్లు, పాలగిరి వెంకటేశ్వర్లు, వేమా రమణయ్య (పొట్లపాడు యోగేంద్ర స్వామి గుడి మాజీ ధర్మకర్త) కొత్తా కోటి, పమిడిశెట్టి రామయ్య, పమిడిశెట్టి సుబ్బారావు, యాదగిరి పుల్లయ్యలు పాల్గొనడం జరిగినది.