ఎంబీఏ ప్రవేశాలకు ఆహ్వానం

ఖమ్మంలోని కేయూ పీజీ కళాశాల కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఎంబీఏ కోర్సులో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ వరలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐసెట్‌-2020లో అర్హత పొందిన విద్యార్థులు రెండో విడత వెబ్‌ ఆప్షన్లలో కోడ్‌ కేయూకేహెచ్‌ఎస్‌ఎఫ్‌ను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని కోరారు. ఇతర వివరాలకు కళాశాలలో సంప్రదించాలని వరలక్ష్మి సూచించారు.

దూరవిద్య డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువు పొడిగింపు: కేయూ దూరవిద్య కేంద్రం ద్వారా అందిస్తున్న డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువు ఈ నెల 31 వరకు పొడిగించినట్లు కేయూ పీజీ కళాశాల ఖమ్మం సమన్వయకర్త డాక్టర్‌ టి.గోపి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు ఖమ్మంలోని దూరవిద్య అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.