కుల, మతాలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయం: గాదె

పొన్నూరు మండలం తాళ్లపాలెం గ్రామంనందు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు పాల్గొని వారి చేతుల మీదగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడమైనది. గాదె మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలకు రావడం, మీ అందరి సహకారంతో గ్రామాలలో కుల, మతాలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయం. పల్లెటూర్లు బాగా అభివృద్ధి చెందితే మన రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు వారిని నియోజకవర్గ జిల్లా నాయకులు, జనసైనికులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని గాదె కి ఘనస్వాగతం పలికి, దేవస్థానం నందు అధ్యక్షుల వారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. తదుపరి గ్రామస్తులు అధ్యక్షుల వారికి దుశ్శాలువతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లూరి అప్పారావు, దేశంశెట్టి సూర్య, మండల అధ్యక్షులు నాగిశెట్టి సుబ్బారావు మరియు మండల కార్యవర్గ సభ్యులు జనసైనికులు పాల్గొన్నారు.