మన సనాతన ధర్మాన్ని రక్షించడం మన బాధ్యత: రామ్ చరణ్

మెగా వారసుడు రామ్ చరణ్ ట్విట్టర్ లో తనదైన శైలిలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫ్యాన్స్ కి మంచి మంచి విషయాలను షేర్ చేస్తున్నాడు. తన విషయాలనే కాక తన తండ్రి మెగాస్టార్ అప్ డేట్స్ కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ సతీమణి కూడా ఎప్పటికప్పుడు నలుగురికి ఉపయోగపడే విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. అయితే రామ్ చరణ్ తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన హిందూ ధర్మాన్ని రక్షించమని పిలుపు ఇవ్వగా ఆ పిలుపు కి స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ ఈరోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించారు. అయితే ఈ దృశ్యాన్ని రామ్ చరణ్ ట్విట్టర్లో షేర్ చేస్తూ మన సనాతన ధర్మాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని రాశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు అందరూ రామ్ చరణ్ ఆలోచనా విధానానికి ఎంతగానో ఆశ్చర్యపోతూ మురిసిపోతున్నారు.