జనసేనానికోసం వారహి దీక్షను చేపట్టిన రామేళ్ల శివాజీ

శృంగవరపుకోట నియోజకవర్గం: వారహి గుప్త నవరాత్రుల సందర్భంగా శృంగవరపుకోట నియోజకవర్గం జనసేన నాయకులు రామేళ్ల శివాజీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎలాంటి శత్రు హాని లేకుండా, వారహి యాత్ర దిగ్విజయంగా కొనసాగి, 2024 ఎన్నికలలో జనసేనకు విజయం చేకూరాలని సంకల్పించి 21 రోజుల దీక్షను శుక్రవారం ఉదయం ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ, గోరపల్లి రవి కుమార్, జొన్నపల్లి సత్తిబాబు పాల్గొన్నారు.