దిల్లీ పర్యటనలో బాగంగా అమిత్‌ షాతో మరోసారి జగన్‌ భేటీ

ఏపీ సీఎం జగన్‌ దిల్లీ పర్యటనలో బాగంగా  నిన్న సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే జగన్‌ ఈ రోజు కూడా మరోసారి భేటీ అయ్యారు. అంతకు ముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో… పోలవరానికి నిధులు, పలు ప్రాజెక్టులకు కేంద్ర సహకారంపై చర్చించినట్టు సమాచారం. సీఎం జగన్‌ వెంట వైకాపా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులు ఉన్నారు.