జగన్ రెడ్డి 420 బుద్ధులు మానుకో: పెండ్యాల శ్రీలత

• పవన్ కళ్యాణ్ కి ప్రజలలో పెరుగుతున్న ఆదరణను చూసి ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోలేకే జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై దాడి చేయాలనే కుట్ర చేస్తున్నాడు.
• పవన్ కళ్యాణ్ కి చిన్న హాని తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోతుంది.
• పవన్ కళ్యాణ్ కి ఎటువంటి హాని జరగకుండా వీర మహిళలు, జనసేన నాయకులు, జనసైనికులు రక్షణగా నిలుస్తాం.
• కేంద్రం తక్షణమే పవన్ కళ్యాణ్ కి జడ్ కేటగిరి సెక్యూరిటీని కేటాయించాలి.
• రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత.

అనంతపురం, జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో రాయలసీమ మహిళా భాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ప్రజలలో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేని వైసిపి గుండాలు ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోలేక భౌతిక దాడులు చేయాలని కుట్ర చేస్తున్నారని ఇందులో భాగంగా గతంలో కూడా విశాఖపట్నంలో జనవాని కార్యక్రమానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ పై దాడి చేయాలని చూశారని కానీ అక్కడ విపరీతమైన జనసేన శ్రేణుల మధ్య వారి దాడులకు పప్పులు ఉడకవని గ్రహించి గత మూడు రోజుల నుంచి హైదరాబాదులోని పవన్ కళ్యాణ్ గృహం నందు రెక్కీ నిర్వహించి అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో గొడవలకు ప్రేరేపిస్తూ దాడులు చేయాలని చూస్తున్నారని, పవన్ కళ్యాణ్ కి ఎటువంటి హాని జరగకుండా వీర మహిళలు, జనసేన నాయకులు, జన సైనికులు పవన్ కళ్యాణ్ కి రక్షణగా నిలుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, వీరమహిళ శైలజ తదితరులు పాల్గొనడం జరిగింది.