పసి పిల్లల దగ్గర పెళ్లిళ్ల గురించి అవసరమా జగన్ రెడ్డి!!

పాలకొండ నియోజకవర్గం: మన్యం జిల్లా, కురుపాంలో సీఎం జగన్ రెడ్డి వ్యాఖ్యలను జనసేన జానీ ఖండించారు. బుధవారం మీడియా ముఖంగా జానీ మాట్లాడుతూ.. అమ్మవడి ప్రోగ్రాంలో పసి పిల్లలు దగ్గర పెళ్లిళ్లు గురించి అవసరమా.. పిల్లలు భావి తరాల భవిష్యత్తు గురించి చెప్పాలి. చివరికి పిల్లలలో కూడా విషం నింపుతున్నాడు. పిల్లలు బావితరాల భవిష్యత్తు కనుక శరీరకంగా, మానసికంగా ఎదగాలి, ఆటల్లో రాణించాలి, ప్రతీ తరగతిని కాంఫిటేషన్ లా ఫీల్ అయ్యి చదవాలి. మీరు బాగుంటే ఈ రాష్ట్రము, ఈ దేశం బాగుంటుంది. అని చెప్పాల్సింది పోయి, పనికిమాలిన మాటలు ఆడటం నీ ఇంగిత జ్ఞానానికే వదిలేయాలి జగన్. అలానే నీలాగా రాజన్న నీ తండ్రి గారు పదవి పెట్టుకోని చాలా సింపుల్ గా ప్రజలు సొమ్మునీ లక్ష కోట్లు కొల్లగొట్టేసావు. 16 నెలలు జైలుకి వెళ్ళావు. నీపైన 31 కేసులు ఉన్నాయి. నీ గెలుపు కోసం రాజన్న చావుని వాడుకున్నావు. నీకోసం మీ అమ్మ, చెల్లమ్మని వాడుకున్నావు. ఇప్పుడు వాళ్ళు అందరిని ఒక్కో రకంగా గెంటేసావు అనుకో. తండ్రి చావు, బాబాయ్ చావు కోడి కత్తి ఇన్ని డ్రామాలు ఆడి ప్రజలు దగ్గరికి వెళ్ళి ఏడుచుకొని సింపతి సంపాదించుకొని, ని అబద్దాలు మాటలు ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే.. ఇప్పుడు నువ్వు ఏమి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో చేసావో చెప్పు అని జనసేనాని అడిగితే.. పెళ్లిళ్లు టాపిక్ తీసుకొస్తావు. ఏంటి రెడ్డి ఒక్క ఉద్యోగం లేదు, ఒక్క రోడ్ తిన్నగా లేదు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగులేదు రెడ్డి అవి అన్ని ఎందుకు గానీ ముందు నిన్ను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటుతో 2024లో ఓడించి ప్రజా ప్రభుత్వం జనసేన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. కనుక 2024లో పవన్ కళ్యాణ్ గారిని మేము సీఎం చేసుకుంటాం అని జనసేన జానీ(ఆర్కే) అన్నారు.