జగనన్న ఇళ్ళు-పేదలందరి కన్నీళ్లు

గుంటూరు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న ఇళ్ళు-పేదలందరి కన్నీళ్లు అనే పేరుతో #JaganannaMosam అనే టాగ్ తో డిజిటల్ కాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్ళు, జగనన్న ఇళ్ళు గురించి రాష్ట్ర ప్రజలకు తెలియ జేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో భాగంగా నాయకులు కొర్రపాటి నాగేశ్వరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాధ్ సోమవారం ప్రత్తిపాడు మండలం వంగిపురం నుండి వల్లూరు వెళ్లే దారిలో ఉన్న జగనన్న కాలనీని సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జగనన్న ఇళ్ల పేరుతో పేద ప్రజల్ని మోసం చేస్తున్నారు అని అన్నారు. అలాగే ఈరోజు జగనన్న కాలనీల పేరుతో రాష్ట్రంలో దోపిడీ చేశారు అని ఇక్కడ అవినీతి తప్ప అభివృద్ధి లేదు అని ఆరోపించారు.