జనసేన డిజిటల్ క్యాంపెయిన్ లో శ్రీకాళహస్తి జనసేన

శ్రీకాళహస్తి నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిని ఘాడ నిద్రలో ఉన్న సీఎం జగన్ రెడ్డికి తెలియజేసేలా చేపట్టిన డిజిటల్ కాంపయిన్ #GoodMorningCMSir కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో, ఏర్పేడు మండలంలో పలు ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితిని పరిశీలించిన నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. రోడ్ల దుస్థితికి సంభందించిన వీడియోలను చిత్రీకరించి #GoodMorningCMSir అనే హాష్ టాగ్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో ప్రచురించడం జరిగింది. జూలై 15 నాటికల్లా ఒక్క గుంత కూడా ఉండదు అని చెప్పిన సీఎం ఒక్క గుంత కూడా పుడ్చని పరిస్థితి రాష్ట్రంలో నెలకొనింది. ఇకనైనా ఘాడ నిద్ర నుండి లేచి రోడ్లపై దృష్టి పెట్టాలని నిరసన చెయ్యడం జరిగింది. 5-10 కి.మీ ప్రయాణం చెయ్యాలన్నా సీఎం హెలికాప్టర్లో వెళ్తే ప్రజలు రోడ్ల వల్ల పడుతున్న ఇబ్బందులు ఎలా తెలుస్తుందని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఏర్పేడు మండలం ముసలిపెడు నుండి పాపానాయుడు పేట వెళ్ళే ప్రధాన రహదారి వద్ద అతి పెద్ద గోతుల రోడ్డున పరిశీలించడం జరిగింది.