అక్టోబర్ 05న జగనన్న విద్యా కానుక కిట్ లు..

స్పందన కార్యక్రమంలో భాగంగా 2020, సెప్టెంబర్ 29వ తేదీ మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పలు అంశాలపై ఆయన సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 02వ తేదీన ఏపీలో స్కూల్స్ తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

పిల్లలకు విద్యా కానుక కిట్ లు అందచేస్తామని సీఎం జగన్ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ 02వ తేదీన పాఠశాలలు ప్రారంభమౌతున్న సందర్భంగా..అక్టోబర్ 02వ తేదీన విద్యా కానుక కిట్ లు అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం జగన్ ఇప్పుడే పిల్లలకు కిట్‌ ఇస్తే స్కూళ్లు తెరిచేలోగా యూనిఫామ్‌ కుట్టించుకోగలుగుతారన్నారు.