వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం, గాఢ నిద్రలో ఉన్న సీఎంను మేలుకొలుపుదాం. రోడ్లు గుంతల్లో పడి ప్రాణాలు పోతున్న రోడ్ల మరమత్తులు పట్టించుకోని ప్రభుత్వం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా. వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో రోడ్ల అద్వాన పరిస్థితులను తెలియజేస్తూ #GoodMorningCMSir అను డిజిటల్ క్యాంపెయిన్ భాగంగా గంగులయ్య మాట్లాడుతూ 2వ రోజు పాడేరు నియోజకవర్గం జీ. మాడుగుల మండల కేంద్రం నుండి నుర్మత వెళ్లే ప్రధాన రహదారి గోతులమయం ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. రోడ్లు అద్వాన పరిస్థితిని గమనించాలి. ఇప్పటికైనా తక్షణమే వైసీపీ ప్రభుత్వం మేలుకొని రోడ్లు మరమ్మతులు చేయాలని పాడేరు జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో, జనసేన ఇంఛార్జ్ డా. వంపూరు గంగులయ్య, జీ. మాడుగుల మండల అధ్యక్షులు మసాడి బీమన్న, రమేష్, ధర్మారావు, అనిల్ కుమార్, అశోక్, సంతోష్ మరియు జనసైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-16-at-7.48.49-PM-1024x768.jpeg)