గొల్లగూడెం గ్రామంలో జనంలోకి జనసేన
నరసాపురం, జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా 17 వ రోజు నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం, మొగల్తూరు పంచాయతీ, గొల్లగూడెం గ్రామంలో ఇంటింటికీ తిరిగి జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేసి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వారికి జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పిఎసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ చైర్మన్ బొమ్మిడి నాయకర్. ఈ గ్రామంలో ముఖ్యంగా రోడ్డు సమస్య మరియు మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు అని ఆ గ్రామ ప్రజలు తెలిపారని నాయకర్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపికృష్ణ, ఆకన చంద్రశేఖర్, వలవల నాని, బందెల రవీంద్ర, నిప్పులేటి తారకరామారావు, బందెల ఎలేషా,దూది బాబు, ఉప్పులురి రాంబాబు, లక్కు బాబి, అయితం చిన్ని, గజ్జరపు మురళి ఫణి, మేకల పరుశురాం, ముక్కు గిరి, కొండేటి తాతాజీ, అందే జగదీష్, తణుకుల నాగరాజు తణుకుల నరేష్, మైల నాగరాజు, కడలి త్రిమూర్తులు, దాసరి నాగరాజు, కత్తుల వంశీ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు మరియు మొగల్తూరు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-29-at-18.24.24-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-29-at-18.24.24-1-1024x768.jpeg)