కనిగిరిలో జనసేన బలోపేతం దిశగా వరికూటి
కనిగిరి, జనసేన పార్టీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు ఆదేశాల మేరకు జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యులు మాదాసు రమేష్ సారథ్యంలో వెలిగండ్ల మండలం అధ్యక్షుడు తాతపూడి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వెలిగండ్ల మండలంలోని వెలిగండ్ల, నాగిరెడ్డి పల్లి జనసేన కార్యకర్తలని కలసి పార్టీ బలోపేతం గురించి చర్చించి తగుసూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, హరినాథ్, సురేష్, ఆంజనేయులు, దాసరి అయ్యప్ప, సాయి కిషోర్ మరియు జనసేన కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-17-at-11.25.34-1024x458.jpeg)