శ్రీశ్రీశ్రీ గంగానమ్మ అమ్మవారి జాతరలో జనసేన నాయకులు

కైకలూరు, శ్రీశ్రీశ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర సందర్భంగా కైకలూరు గ్రామంలో ఆదివారం ఉదయం గంగానమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కైకలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొల్లి వరప్రసాద్(బాబి), జనసేన వీర మహిళ శ్రీమతి తోట లక్ష్మి లకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన కమిటీ సభ్యులు తులసి పూర్ణచందర్రావు మరియు తోట కార్తీక్ నాయుడు. జనసేన పార్టీ మండల సెక్రటరీ నల్లగొపుల మణికంఠ, సంయుక్త కార్యదర్శి నారా అభినయ్ చిరంజీవ మండల ఉపాధ్యక్షులు గుర్రం అరవింద్ ప్రసాద్ మరియు కమిటీ సభ్యులు జనసేన పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.