ఎస్ ఎల్ వి ఆర్ ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు
వేమూరు నియోజకవర్గం: చుండూరు మండలం, మున్నంగి వారి పాలెంలో యాజలి గుడికి వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి మరణించిన ఎస్ ఎల్ వి ఆర్ ప్రసాద్ కుటుంబాన్ని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆ కుటుంబానికి భరోసా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో చుండూరు మండల ప్రెసిడెంట్ అమ్మిసెట్టి శ్రీరామ్ మూర్తి మరియు చేబ్రోలు మండల ప్రెసిడెంట్ చందు శ్రీరాములు జిల్లా కార్యదర్శి మేకల రామయ్య యాదవ్, నారదాసు రామచంద్ర ప్రసాద్, నెల్లూరి రాజేష్ మరియు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-16-at-19.50.30-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-16-at-19.50.40-768x1024.jpeg)