దాడికి గురైన పత్రికా విలేకరిని పరామర్శించిన జనసేన నాయకులు

అన్నమయ్య జిల్లా, మదనపల్లె మరియు తంబల్లపల్లె నియోజకవర్గాల ఆంధ్రప్రభ పత్రికా విలేకరిగా విధులు నిర్వహిస్తూ దాడికి గురైన తలారి శివను జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం మదనపల్లె రూరల్ మండల అధ్యక్షుడు గ్రానైట్ బాబు మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో పరమర్శించడం జరిగింది. ఈ మధ్యకాలంలో తంబల్లపల్లె నియోజకవర్గంలో రెవిన్యూ మరియు ఇతరుల భూములు కబ్జా చేస్తున్నారని ఆంధ్రప్రభలో వార్త రాసిన విలేఖరి శివను మదనపల్లెలో నీరుగొట్టిపల్లె సమీపంలో దారికాసి దాడి చేసి, కిడ్నప్ చేసి షేడ్లో బంధించి కొట్టిన వెంకటేశ్వరరెడ్డి భాస్కరరెడ్డి మహేశ్ ని వారి అనుచరులను అరెస్టు చేయాలని జనసేన డిమాండ్. ఏ పత్రికా విలేకరి అయినా నిజం రాస్తే వారి మీద దాడి చేయడము చాలా పెద్ద తప్పు. 10 రోజులు ముందు భూములు కబ్జా చేస్తున్నారు అని వార్త రాస్తే మీరు అతన్ని ఇంత దారుణంగా కొట్టడంపై మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కి తీసుకొని వెళ్లి నిజం నిర్భయంగా రాస్తున్న రాష్ట్రంలోని పత్రికా విలేకర్లకు న్యాయం జరిగేంతవరకూ మీ అందరి కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.