జేపీ పవర్ వెంచర్స్ ఇసుక దోపిడీని అడ్డగించిన జనసేన నేతలు
పెనుకొండ నియోజకవర్గం: పరిగి మండలంలో నిబంధనలు ఉల్లంఘింఛడమే కాకుండా ఇచ్చిన పర్మిషన్ ముగిసిన పరిగిలోని జయమంగళి పరివాహక ప్రాంతాలో జేపీ పవర్ వెంచర్స్ సంస్థ చేస్తున్న ఇసుక దోపిడీని తెలుసుకున్న జనసేన పార్టీ మండల అధ్యక్షులు సురేష్, బిజేపి మండల అధ్యక్షులు బద్రినాథ్, స్థానిక యువతతో కలిసి ఇసుక దోపిడీని గురువారం అడ్డుకోవడం జరిగింది. జయమంగళి నదిలో ఉన్న వాహనాలను పరిగి దాటించే వరకు తరిమికొట్టారు. నాయకులు స్థానిక యువత తిరగబడటంతో నేటితో పరిగి నుండి వెళ్ళిపోతాం అని జేసీ పవర్ వెంచర్స్ వారు తెలియజేయడంతో నాయకులు శాంతించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు మరియు బిజేపి మండల నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-20-at-9.35.53-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-20-at-9.35.53-PM-1024x576.jpeg)