కరుబోలు చిన్నయమ్మ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు
అల్లూరి జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, అడ్డతీగల మండలం, రాయపల్లి గ్రామంలో బుధవారం గత మూడు రోజుల క్రితం అనారోగ్య కారణంగా చనిపోయిన కరుబోలు చిన్నయమ్మ వాళ్ల కుటుంబాన్ని కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపి తన కొడుకుని కలిసి 3000 రూపాయలు అడ్డతీగల మండలం జనసేన పార్టీ తరపున అందజేయడం జరిగింది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం వివరాలు అనారోగ్య సమస్య వల్ల చనిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదని వివరించడం జరిగింది. ఇన్సూరెన్స్ సంవత్సరానికి 500 రూపాయలు మనం కట్టాలి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంవత్సరానికి ఒక్కొక్క వ్యక్తికి 1500 రూపాయలు చొప్పున కడతారని ఈ విషయం చెప్పడం జరిగింది. ప్రమాదవశాత్తు గాయపడితే 10000 నుండి 50,000 వరకు వస్తాయని ప్రమాదవశాత్తు చనిపోయినా సరే 5 లక్షల రూపాయలు నామిని ఎవరు పెడతారో వాళ్లకి ఈ యొక్క పథకం వర్తిస్తాదని అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, చిన్నారెడ్డి, సురేష్ రెడ్డి, అప్పాజీ, బాబీ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-18-at-15.27.48-1024x576.jpeg)